15-05-2025 01:54:30 AM
హాజరైన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, మే 14 (విజయ క్రాంతి): ఘట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.