14 August, 2026 | 8:14 PM

Breaking News

60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •  

ఇరాన్‌పై విజయం

20-09-2024 12:00 AM

45వ చెస్ ఒలింపియాడ్

బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు జోరు చూపిస్తున్నారు. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లు పాల్గొన్న గేమ్‌లో ఒక్క ప్రజ్ఞానంద తప్ప ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. ఇప్పటికే జరిగిన ఏడు రౌండ్లలో సత్తా చాటిన భారత గ్రాండ్ మాస్టర్లు ఇరాన్ ఆటగాళ్లకు కూడా చెమటలు పట్టించారు. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.