calender_icon.png 20 June, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో వికసిత్ సంకల్ప సమావేశం..

19-06-2025 10:12:42 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్ లో వికసిత్ సంకల్ప సమావేశాన్ని బిజెపి మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్(District President Bairi Shankar Mudiraj) హాజరైనారు, వారు మాట్లాడుతూ... ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీజీ సుపరిపానలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, స్మశాన వాటికల నిర్మాణం, ఉపాధి హామీ ద్వారా రహదారులు చేపట్టడం జరిగిందన్నారు.

ముఖ్యంగా ఆడపిల్లల సంక్షేమం కోసం సుకన్య యోజన, యువకుల కోసం పీఎం. జేజేవై, రైతుల కోసం పిఎం కిసాన్ యోజన వివిధ రకాల ప్రమాద బీమా పథకాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత బిజెపి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు, రాష్ట్రాలలో కేంద్రం వాటా కింద రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 5 కిలోలు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్రం వాటా ఉన్నదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పథకాలను మరుగున చేస్తున్నాయని ఈ సమావేశంలో గుర్తు చేశారు. తెలంగాణలో వచ్చే స్థానిక సమరంలో ప్రతి చోట పోటీ పోటీకి సిద్ధమవుతున్నామన్నారు.

దీని దృష్ట్యా జిల్లాల మండలల, మున్సిపల్ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గడప గడపకు చేరవేసేలా ప్రచారంలో భాగంగా కృషి చేయాలని పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తలు స్థానిక సమరంలో ప్రతి ఒక్కరూ శాయశక్తుల కష్టపడి పని చేయాలని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ నత్తి మల్లేష్ ముదిరాజ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంఖ్య యాదిగిరి, తూప్రాన్ మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య, మనోహర్వాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మహిళా నాయకురాలు సీతామాలక్ష్మి, తాటి విట్టల్, మహేష్, స్వర్గం మురళి, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.