19-06-2025 10:14:20 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని సంబరాలను జరుపుకున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి(Former MLA Narsa Reddy) ఆధ్వర్యంలో గజ్వేల్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో తూప్రాన్ మండలం, మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు కలసి బాణాసంచా పేల్చి బర్త్డే కేక్ కట్ చేసుకుని నోరు తీపి చేసుకున్నారు. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మహిళా ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, మండల నాయకులు జింక మల్లేశం, సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.