12-11-2025 01:18:28 AM
రాజేంద్ర నగర్, నవంబర్ 11 (విజయక్రాంతి) : ఈనెల 13వ తేదీ నుంచి డ్యూయల్ డిగ్రీ అగ్రికల్చర్ కోర్సులకి ( ఎన్ ఆర్ ఐ ప్రాయోజిత కోటా కింద బి ఎస్సీ ఆనర్స్) వాక్ - ఇన్ - కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ జి ఇ సి హెచ్ విద్యాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బి ఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటా బిఎస్సి (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బి ఎస్ సి (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, వెబ్ సైట్ లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని తెలిపారు.