17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

02-11-2025 12:00 AM

మేడిపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్  కమిషనర్ ఏ. శైలజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లపై అధిక చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి,  ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇచ్చట చెత్త వేయరాదు వేచినచో 25 వేల రూపాయల వరకు జరిమానా విధించబడును అని హెచ్చరిక  బోర్డులను ఏర్పాటు చేశామని, వాటిని ఉల్లఘించినచో శిక్షార్హులని ఆమె తెలిపారు. స్వచ్ఛ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.