11-02-2026 03:18:23 AM
జవహర్ నగర్ ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని జిహెచ్ ఎంసి జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో మంగళవారం మంచినీటి పైప్ లైన్ లీక్ అయి మంచినీరు వృథాగా రోడ్డుమీద ప్రవహించింది.ఈ సందర్భంగా చెన్నాపురం వాసులు మీడియాతో మాట్లాడుతూ మంజీరా నీరు భారీ ఎత్తున వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జవహర్ నగర్లో అసలేనీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురికినీటి బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి) అధికారులు నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని జవహర్ నగర్ ప్రజలు కోరుతున్నారు.