04-06-2025 10:51:03 PM
చైర్మన్ లైన్ నీలి ప్రకాష్..
చర్ల (విజయక్రాంతి): మండల పరిధిలో గల విజయ కాలనీకు చెందిన బీర గోపాల్ కుమార్తె అయిన భువనేశ్వరి హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ అఫ్ ఇంజనీరింగ్ కళాశాల(Brilliant Group of Engineering College)లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది, తండ్రి బీర గోపాల్ వంట పనులు చేసుకుంటూ, ఎంతో కష్టపడి తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రాజెక్టు వర్క్ చేయడానికి లాప్టాప్ కంప్యూటర్ అవసరం కావడంతో ఆర్థిక సహాయం కోసం మీకోసం మేమున్నాం టీం ను ఆశ్రయించడంతో పలువురు దాతలను సంప్రదించి - సేకరించిన రూ. 30 వేలు రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు.
మీకోసం మేమున్నాం టీం ద్వారా వారాంతపు అన్నదానాలు, వాల్ ఆఫ్ కైండ్ నెస్ వంటి పలు ప్రజాహిత కార్యక్రమాలతో పాటూ విద్య, వైద్యం ప్రాధాన్యతలతో కూడిన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ... గతంలో కూడా ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి లాప్టాప్ ను సమకూర్చామని, ఇద్దరు మెరిటోరియస్ విద్యార్థినులను సంస్థ ద్వారా ఖర్చులు భరిస్తూ 4 సంవత్సరాల పాటూ ఉన్నత విద్య కోర్సులను చదివిస్తూన్నామన్నారు. భఇప్పటి వరకు సంస్థ ద్వారా సుమారు 985 సేవా కార్యక్రమాలు చేపట్టి రూ 88 లక్షలు వితరణ చేయడం జరిగిందని, సంస్థకూ సహకరిస్తూ వస్తూన్న దాతలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డ ప్రభుదాస్, దొడ్డి సూరిబాబు, బి వి ప్రతాప్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.