calender_icon.png 26 October, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం

25-10-2025 01:02:30 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, అక్టోబర్ 24 ( విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం 57 వ మరియు 59వ  డివిజన్ లలో సుమారు  4 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైనేజీ నిర్మాణం మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి  పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్ లో  అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రానున్న  రోజుల్లో అన్ని డివిజన్లలో  పర్యటన చేసి ప్రతి కాలనీలో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంతా మహేందర్ రెడ్డి, బంక సరళ సంపత్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.