25-06-2025 10:33:45 PM
డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్..
హనుమకొండ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారంకై విద్యార్థులు ఉద్యమించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో డిఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్(DSFI state leaders Ajmera Venkat) మాట్లాడుతూ... ప్రపంచీకరణ ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రభుత్వ విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేటు సంస్థలను అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు.
పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల తల్లితండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని, విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మరిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయని ఎడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లెపు సాయి వర్ధన్, ఏ. వంశీకృష్ణ బి. భాస్కర్, రమేష్, చరణ్, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.