calender_icon.png 13 June, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చురుకైన వారికే బోధిస్తాం!

13-06-2025 12:49:18 AM

  1. ప్రైవేటు పాఠశాలల వింత పోకడ

ఎంట్రన్స్ ఎగ్జామ్‌తో వడపోత

టెస్టు లో ఉత్తీర్ణత రాకుంటే నో అడ్మిషన్

మహబూబ్ నగర్ జూన్ 12 (విజయ క్రాంతి) : చదువులో వెనుకబడ్డ తమ బిడ్డలను ఉన్నత చదువులు అందించాలని సం కల్పంతో తల్లిదండ్రులు వేలాది రూపాయ లు ఖర్చుపెట్టి ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ప్రవేట్ పాఠశాల గేటు దాటిన వెంటనే ముందుగా మీ బిడ్డకు ఎంట్రన్స్ టె స్ట్ రాయించాల్సిందే... ఆ తర్వాత ఉత్తీర్ణత సా ధిస్తేనే మా పాఠశాలలో మీ బిడ్డకు అడ్మిషన్ ఇస్తామంటూ కరాకండిగా చెప్పేస్తుండ్రు.

కొ న్ని ప్రైవేట్ పాఠశాలల్లో రోజుకు పదిల సం ఖ్యలో విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు. వీరిలో ఆచితూచి ఫీజులు కట్టగలు గుతారా ? లేదా ? అని అంచనా వేస్తూ మీ బిడ్డ సరిగ్గా చదవటం లేదని విద్యార్థుల ముందే తల్లిదండ్రులతో ఆయా ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వ్యా పారం కూడా ఆయా పాఠశాలల్లో ఏదేచిం గా జరుగుతుంది.

ఎందుకు ప్రతి టెస్టుకు ప్రత్యేక రుసుము సైతం వసూలు చేస్తున్నా రు. టెస్టు రాస్తేనే అడ్మిషన్ ఇస్తా ఇచ్చేది ఇబ్బంది చెబుతామంటూ కండిషన్లు అప్లై చే స్తుండ్రు. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు చూడడమే మానేశారు. ఇదేం విధానం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

-అసలు ఇవేం నిబంధనలు...?

ప్రవేట్ పాఠశాలలో చదివిస్తే బాగా చదువుతారు.. మంచి ఉద్యోగం వస్తుంది నా బిడ్డ కు అనే వారికి కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందు టెస్ట్ రాస్తేనే తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ కరాకండిగా చెప్తుండ్రు. వె నుకబడిన విద్యార్థులకు చదువు చెప్పి బాగా చదివేలా చేయించాలని ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులకు.. చదువు రాకుంటే మేము మీ బిడ్డకు చెప్పలేమంటూ తెగేసి చెబుతున్నారు.

ప్రవేట్ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు ముందుగా పరీక్ష రా యాలంటే ఒక విద్యార్థికి రూ 150 నుంచి రూ 500 వరకు కరాకండిగా వసూలు చేస్తున్నారు. తీరా ఈ పరీక్షలు ఫెయిల్ అయితే మీ బిడ్డను చేర్చుకోమంటూ నిర్లక్ష్యంగా స మాధానం చెబుతున్నారు. రోజుకు ప్రజల సంఖ్యలో విద్యార్థులు టెస్టులు రాయడంతో పాటు వేలాది రూపాయలు ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పోగు చేసుకుంటున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వివరిస్తున్నారు. 

- దర్జాగా వసూల్..

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దర్జాగా కొన్ని ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు వ సూల్‌కు పాల్పడుతున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే అంటూ కండిషన్లు పెడుతున్నాయి. దర్జాగా అన్ని విభాగాలు అందిన కా డికి దోచుకుంటున్న అధికారులు మాత్రం అటువైపు చూడడమే మర్చిపోయారు.

ఏ ప్రైవేట్ పాఠశాలల ఇంత మేరకు ఫీజులు వ సూలు చేసిన..? నిబంధనలు వారి ఇష్టము సారంగా పెట్టుకున్న..? విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదు. ఎక్కడికి అక్కడ ఎవరి ఇష్టం సారంగ వారు ఆయా ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి నిబంధనలు అమలు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

- నిబంధనలు పాటించాలి..

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేనియెడల చర్యలు తీసుకుంటాం. ఏ పాఠశాల మీద ఫిర్యాదు వచ్చిన వెంటనే తనిఖీలు చేప ట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుం ది. టెస్టుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు గురి చేయద్దు. పర్యవేక్షణ చేసి నిబంధ నలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. 

ప్రవీణ్ కుమార్, డీఈవో, మహబూబ్ నగర్