calender_icon.png 13 June, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డుల విభజన శాస్త్రీయంగా లేదు

13-06-2025 12:50:49 AM

మహబూబ్‌నగర్, జూన్ 12 (విజయ క్రాంతి) : నగర పాలిక వార్డు ల విభజన శాస్త్రీయంగా లేదని...అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరి చేయాలనీ మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు ల విభజన చేయాలనీ కోరారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీ ల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే విధంగా వార్డు ల విభజన చేస్తే భవిష్యత్ లో అభివృద్ధి కి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీ లు.. వార్డు లాపేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేసారని పేర్కొన్నారు.

స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డు ల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సరి చేయకుంటే ప్రజాక్షేత్రం లోకి వెల్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ.. గతంలో వార్డు ల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తరువాతే ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలని అధికారులకి చెప్పిన విషయాన్నీ ఆయన గుర్తు చేసారు. ఒకదగ్గర కూర్చొని వార్డు ల విభజన చేయడం కాదని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబెర్లతో సమావేశం పెట్టి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.

ఇదే రితిగా అధికారపార్టీ తీరు ఉంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రామ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శరత్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.