13-06-2025 12:46:50 AM
కొత్తకోట జూన్ 12: పాఠశాలల ప్రారం భం నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు దుస్తులు అందించనున్నట్లు మండల వి ద్యాధికారి కృష్ణయ్య అన్నారు. గురువా రం కొత్తకోట మండలం పాలేం గ్రామం లో ప్రధానోపాధ్యాయులు ఆద్వర్యంలో ప్రభు త్వం జారీ చేసిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కేట్ కమిటీ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న విద్యతో పాటు ఉచిత పాఠ్య పు స్తకాలు మరియు దుస్తువులు అందించిన్న ట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లలోనే చేర్పించాలని కోరారు.
చరిత్ర లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ చర్లపల్లి శేఖర్ రెడ్డి,మండల జనరల్ సెక్రటరీ గుంతరమణ,కిరణ్, ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు.