04-02-2026 06:04:24 PM
మంథనిలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ లతో మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కో- ఆప్షన్ సభ్యులను నియమిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మంథనిలో వారి నివాసంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంథని మున్సిపల్ ఎన్నికల్లో 13 మంది కి మంది భారీ మెజారిటీతో గెలుపొందలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు వివరించాలని కోరారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ప్రజలకు మేడం నమ్మకం కల్పించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.