calender_icon.png 24 June, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పల్లెకు ఆర్టీసీ సేవలను విస్తరిస్తాం

24-06-2025 12:07:04 AM

మారుమూల గ్రామాల రోడ్ల సమస్యను పరిష్కరించాం కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావుపాల్వంచ - ఉల్వనూరు ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 23 (విజయక్రాంతి)ప్రతి పల్లెకు ప్రజారవాణా ఆర్టీసీ ప్రయాణ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం అని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాం బశివరావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఉల్వనూరు ప్రాంతానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ సర్వీసులును లాంఛనంగా ఆయన ప్రారంభించను న్నారు. తొలుత జండా ఊపి బస్ సర్వీసును ప్రారంభించాక మొదటి టికెట్ కొని బస్ లో అధికారులు, మహిళలతో కలిసి ప్రయాణించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రధాన రోడ్ల సమస్యను పరిష్కరించామని అతి త్వరలో అంతర్గత రోడ్లు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజా రవాణా ఆర్టీసీని ప్రజలు ఆ దరించాలని, ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే. సుజాత, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ దేవందర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే.సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.