calender_icon.png 24 June, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపినా ఆగని అక్రమ నిర్మాణాలు

24-06-2025 12:08:58 AM

  1. అధికారులు నోటీసులు ఇచ్చిన బేకతార్ 
  2. అక్రమ నిర్మాణాలపై వరుసగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు 
  3. ప్రభుత్వ భూములలో ప్రైవేట్ నిర్మాణాలు

మహబూబ్ నగర్ జూన్ 23 (విజయ క్రాంతి) : పాలమూరులో పవర్ ఫుల్ గా అ క్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో వార్డు ఆఫీసర్ల పర్యవే క్షణ అంతంత మాత్రమే ఉండడంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి.

నియంత్రించాల్సిన అధికారులు మా త్రం అటువైపు నామమాత్రంగానే చూస్తున్నారని ఆరోపణలు కూడా బలంగా వినిపి స్తున్నాయి. ఈ తరుణంలో దశాబ్దాల తరబడి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు పట్టణవాసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

నోటీసులు ఇచ్చిన ఫలితం శూన్యం?

పట్టణంలో కొన్నిచోట్ల పురపాలక అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నిర్మా ణాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో నిర్మాణాలను ఆపవలసిన అధికా రులు అటువైపు చూడడమే మానేశారు. కొన్నిచోట్ల నోటీసులు ఇచ్చి ఆపాలని చెప్తు న్నా నిర్మాణదారులు మాత్రం వాటి నిర్మాణాలను ఆపేందుకు ఇష్టపడడం లేదు.

నోటీ సులు అందుకొని ఆ నోటీసులకు జవాబు ఇవ్వకుండానే తమ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. అధికారులు పక్క పర్యవేక్షణ చేసి పుర ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషి చేస్తూ అక్రమ నిర్మాణం ఆపవలసిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. 

లక్ష్మీ నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌కు పిర్యాదు..

పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నం. 247లో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని ఆపాలని షెడ్యూల్ కాస్ట్ కార్పొరేషన్ కేటాయించిన భూమిని రక్షించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇది ప్రభుత్వం షెడ్యూల్ కాస్ట్ అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమిపై జరిగిన అక్రమ కేటాయింపు,అనధికారిక నిర్మాణంకి విషయంలో పలు అంశాలతో కూడిన ఆధారాలను కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొ న్నారు.

1989 సంవత్సరంలో, జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ నెం. B6/6261/88, తేదీ: 21-05-1989 ప్ర కారం, సర్వే నంబర్లు 247, 250 లో ఉన్న 5 ఎకరాలు 30 గుంటల భూమిని షెడ్యూల్ కాస్ట్ లబ్ధిదారుల అభివృద్ధి కోసం ఎస్సిడీడీ 1991 సంవత్సరంలో, పట్టణ తహసీల్దార్ ఆయా భూములను ప్రతిసె. గజానికి రూ. 30/- చొప్పున విలువగా తీసుకొని జర్నలిస్టులకు, మాజీ సైనికుల కు , రెవెన్యూ ఉద్యో గులకు కేటాయించినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో కీర్తిశేషులు గులాం మ సూద్ అనే వ్యక్తి సర్వే నం. 247లో 300 చదరపు గజాల భూ మిని పొందారని, పట్టణ రెవెన్యూ కార్యాలయంలో టైపిస్ట్గా పనిచేశారు. గులాం మసూ ద్ ఆప్పటికే డాకుమెంట్ నెం. 1456/1988 ద్వారా తాలూకా రెవెన్యూ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సర్వే నం. 211/1, ఏనుగొండలో 200 చదరపు గజాల ప్లాట్ నం. 64ని పొందినట్లు రికార్డుల్లో ఉంది.

ఒకే వ్యక్తికి రెండు సార్లు ప్ర భుత్వ భూమి కేటాయించడాన్ని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా నిషేధిస్తున్నాయి. ము ఖ్యంగా, మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, నిర్మాణం ప్రా రంభ దశలో కొనసాగుతోంది, ఇది ప్రభుత్వ ఆదేశాలను అవహేళన చేయడమే కాకుండా, చట్టాన్ని కూడా ఖండించే చర్యగా పరిగణించాలి.

ఈ పర్యవేక్షణలో కార్యాలయాన్ని క్రింద పేర్కొన్న చర్యలు తీసుకో వాలని ద యచేసి వినయపూర్వకంగా కోరారు. 1991లో గులాం మసూద్ కి సర్వే నం. 247 లో చేసిన అక్రమ భూ కేటాయింపును తక్షణం రద్దు చేయాలి.ప్రారంభ దశలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఫిర్యాదు ధరలు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు. 

నిబంధన మేరకు అనుమతులు ఉండాలి..

ఎలా పడితే అలా కట్టడం సరికాదు. నియమ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలి. తనిఖీలు చేసినప్పుడు గాని, ఫిర్యా దు చేసినప్పుడు గాని అధికారుల దృష్టికి వస్తే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు నిర్మాణం చేసేటప్పుడే పూర్తిస్థాయిలో నిబంధనలను అమ లు చేస్తూ జరపాలి. తర్వాత బాధపడితే వచ్చే ది ఏమీ ఉండదు. మున్సిపాలిటీ ఇచ్చిన నోటీసులో ఉల్లంఘిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. 

    మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్

అధికారులు పక్కాగా తనిఖీ చేయాలి..

లక్ష్మీ నగర్ భూ మికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. ఈ భూమిని మళ్లీ షెడ్యూల్ కాస్ట్ అభివృద్ధి సంస్థకి అప్పగించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ భూములపై ఎ లా అక్రమ కేటాయింపులు జరిగాయో, ఎలా ఆక్రమణలు జరిగాయో పూర్వాపరాల విచారణ జరిపించాలి.

మిట్టమీది బాలరాజు, పట్టణవాసి,మహబూబ్‌నగర్