18-06-2025 12:53:03 AM
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్ అర్బన్, జూన్ 17: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి పెను భారమైన పేదల సంక్షే మం కోసం రాష్ర్ట ప్రగతి కోసం పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో అమలవుతాయని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని శామీర్పేట్ మండలంలోని ఎస్ ఎన్ ఆర్ పుష్ప కన్వెన్షన్ లో మంగళవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరైనారు.
మల్కాజిగిరి నియోజక వర్గ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి లతో కలిసి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి లబ్దిదారులకు చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఛీప్ విప్ మాట్లాడుతూ.. ఆర్థిక భారం ఉన్నా పేదల సంక్షేమం విడువమని, ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తామని చెప్పారు.
అన్ని పార్టీలకతీతంగా ఎంతో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరు కావడం ఈ కార్యక్రమాన్ని పండుగగా చేసుకోవడం ఎంతో హర్షనీయమన్నారు. జిల్లాలో మొత్తం 805 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 5 లక్షల 93 వేల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల ను ఛీప్ విప్ పంపిణీ చేసారు.
మేడ్చల్ మండలంలో 139 లబ్దిదారులకు రూ. 1,39,16,124/-, శామీర్ పేట్ మండలంలో 71 మంది లబ్దిదారులకు రూ.71,08,236/-. మూడుచింతలపల్లి మండలంలో 27 మంది లబ్దిదారులకు గాను రూ.27,03, 132/-, కీసర మండలంలోని 136 మంది లబ్దిదారులకు రూ.1,36,15,776/-, కాప్రా జవహార్ నగర్ మండలానికి గాను 81 మంది లబ్దిదారులకు రూ.81,09,396/-, ఘట్కేసర్ మండలంలో 131 మంది లబ్దిదారులకు రూ.1,31,15,196/-, మేడ్ పల్లి మండలానికి గాను 220 మంది లబ్దిదారులకు రూ. 2,20,25,520/-ల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేసారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారధి మేడ్చల్ జిల్లా కళాకారులు ప్రభుత్వ పథకాలపై పాడిన పాటలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, శామీర్ పేట్ తహసీల్దారు యాదగిరిరెడ్డి, ఘట్కేసర్ తహసీల్దారు రజిని, కీసర తహసీల్దారు అశోక్, మూడుచింతపల్లి తహసీల్దారు నర్సింహారెడ్డి, కాప్రా తహసీల్దారు సుచరిత, మేడ్పల్లి తహసీల్దారు హసీన, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.