calender_icon.png 18 June, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక ధరలు వసూలు చేస్తే సీజ్ చేస్తాం

18-06-2025 12:00:00 AM

సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్ 

సంగారెడ్డి, జూన్ 17: మీసేవ కేంద్రాల్లో ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కేంద్రాన్ని సీజ్ చేస్తామని సంగారెడ్డి తహసిల్దార్ జయరాం నాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన సంగారెడ్డి మండలం, పట్టణంలో గల కల్వకుంట దారిలో శ్రీ సాయి కమ్యూనికేషన్ మీ సేవ సెంటర్, బాపు గ్రాఫిక్స్ మీ సేవ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.

అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ను మాత్రమే వసూలు చేయాలని, అధిక ధరలు వసూలు చేస్తే మీ సేవ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి సిజ్ చేయడం జరిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంకేతిక విభాగం ఉదయ్, మండల గిర్ధవర్ ప్రవీణ్ రెడ్డి, మీ సేవ నిర్వాహకులుపాల్గొన్నారు.