18-06-2025 12:00:00 AM
సంగారెడ్డి, జూన్ 17(విజయక్రాంతి):ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా వ్యవ హరించిన కొండా సురేఖను ఆ బాధ్యతల నుంచి తప్పించడంలో గల కారణాలపై ప్ర స్తుతం చర్చ పార్టీలో సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజ కవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇంచార్జిలు కొండా సురేఖ తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అలా గే కొండా సురేఖ సైతం కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడిన సం దర్భాలను సైతం దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను జి ల్లాల ఇంచార్జి పోస్టులను మా ర్చినప్పటికీ కొండాసు రేఖకు మా త్రం ఏ జిల్లాకు ఇంచార్జి పదవి ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారి న విషయం తెలిసిందే.
అయితే రాబోయే కా ర్పోరేషన్ ఎన్నికల దృష్ట్యా తన సొంత జిల్లా లో తాను పూర్తిస్థాయిలో సమయం కేటాయించాల్సి ఉంటుందని అధిష్టానం ముం దు కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కొండా సురేఖకు కలిసిరాని ఎన్నికలు...
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖకు మెదక్ పార్ల మెంట్, పట్టభద్రుల, ఉ పాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభా వం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మం త్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో కొండా సురేఖ ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
ప్ర ధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవం ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయా రనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూ డా పార్టీ ఓటమికి కారణమయ్యా యని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నట రాజన్ పార్టీ ఓటమికి కారణాలపై మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించినట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్లో పార్లమెంట్ని యోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ ని యోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుం చి విడివి డిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ మార్పు ఖాయమనే ప్రచారం సాగడం కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్కు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
కొత్త ఇన్చార్జి మంత్రికి సవాళ్లు...
ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్కు స్థానిక సం స్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందు న్న ప్రధాన సవాలు. మెదక్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, జహీరాబాద్ పార్లమెం ట్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గా లు ఉన్నాయి.
అందులో మూడు చోట్ల కాం గ్రెస్, ఏడు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిద్యం వ హిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అ ప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవ ర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గడ్డం వివే క్ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.
కొత్త కమిటీలపై ప్రభావం...
పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్ల ను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ తన మార్కును చూపిస్తారా ? జిల్లాల్లో గ్రూపు తగాదాలను అణచివేస్తారా అనేది వేచి చూడాల్సిందే.