10 May, 2026 | 12:35 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య

22-06-2024 11:15 AM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): చేతిలో పనులు లేక చేసిన అప్పులు తీరక ఓ నేత కార్మికుడు యాసిడ్ తాగి బలవన్మరణం పాల్పడిన విషాదఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11 వార్డు రాజీవ్ నగర్ కు చెందిన కుడిక్యాల నాగరాజు (45) మరమగాలు (పవర్లూమ్) నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాగరాజు గత ఆరు నెలలనుండి ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెందాడు. రూ. 4 లక్షల అప్పు అయ్యిందని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి కాలేజి ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.  చేసిన అప్పులు తీర్చలేక శుక్రవారం రాత్రి బాత్రూంలో వాడే యాసిడ్ తాగాడు.  గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.