23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

వెస్టిండీస్‌దే వన్డే సిరీస్

08-11-2024 01:14 AM

మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి

బ్రిడ్జ్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మౌస్లే (57) అర్థసెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు తీయగా.. జోసెఫ్, షెపర్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 43 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కీసి కార్టీ  (128 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. బ్రాండన్ కింగ్ (102) సెంచరీతో చెలరేగాడు. టోప్లే, ఒవర్టన్ చెరొక వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బ్రాండన్ కింగ్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ మాథ్యూ ఫోర్డ్ గెలుచుకున్నారు.