19-06-2025 12:00:00 AM
జైలు నుంచి విడుదలైన రైతులతో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జూన్ 18 (విజయ క్రాంతి) : పంటలు పుష్కలంగా పండే భూ ముల్లో పరిశ్రమలు ఏంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా జోలి మండలం ధన్వాడలో ఇథనాల్ పరిశ్ర మ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకి వెల్లినా రైతులు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జైలు వద్ద వారిని కలిసి మాట్లాడారు తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఎకరాలకు నీరు అం దించామని, వేరే ప్రాంతం వాళ్ళు అలంపూర్, గద్వాల్ కి వలస వచ్చే విధంగా బీఆర్ఎస్ ప్ర భుత్వం పని చేసిందన్నారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో పరిశ్రమ సరికాదన్నారు.
రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడం సరికాదని,దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉందన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ప్రజలకు మంచి చేసేందుకు మాత్రమే ప్రభుత్వం ఉందనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.