calender_icon.png 19 November, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్త్ ప్లేస్‌లో ఆడేదెవరు?

19-11-2025 12:16:23 AM

-గిల్ డౌట్..నితీశ్‌కు పిలుపు

- రేసులో సాయిసుదర్శన్, పడిక్కల్

కోల్‌కత్తా, నవంబర్ 18 : తొలి టెస్టులో అనూహ్యంగా పరాజయం పాలైన టీ మిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. గుహావటి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా రెండో టెస్ట్ ఆరంభం కా నుంది. ప్రస్తుతానికి కోల్‌కత్తాలోనే ప్రాక్టీస్ చేస్తున్న భారత్ బుధవారం గుహావటికి బయలుదేరుతుంది. మెడనొప్పితో తొలి టెస్ట్ మధ్యలోనే తప్పుకున్న కెప్టెన్ శుభమన్ గిల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తు తం రెస్ట్ తీసుకుంటున్న గిల్ రెండో టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది.

దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో ప్లేస్ ఖాళీ అయినట్టే. ఆ ప్లేస్ కోసం పలువురు యువ ఆట గాళ్లు రేసులో ఉన్నారు. గిల్ స్థానంలో బ్యా టింగ్ చేసేది ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత స్కాడ్‌లో ఈ స్థానానికి సాయి సుదర్శన్, పడిక్కల్ మాత్ర మే ఆప్షన్లుగా ఉన్నారు. సౌతాఫ్రికా ఏతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ పెద్దగా రాణిం చలేదు. ఒకవేళ వీరిద్దరిలో ఒక్కరిని తుది జట్టులోకి తీసుకున్నా మొత్తం ఏడుగురు ఎడమచేచి వాటం బ్యాటర్లు ఆడుతున్నట్టవుతుం ది. లెఫ్ట్ హ్యాండర్లను ఔట్ చేయడంలో సఫారీ స్పిన్నర్ పైచేయి సాధిస్తున్నాడు.

అందుకే జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు వద్ద ని పలువురు మాజీలు సూచిస్తున్నారు. మం గళవారం ప్రాక్టీస్‌లో సాయి సుదర్శన్ , పడిక్కల్ స్పిన్ బౌలింగ్‌లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌల ర్ అయిన హార్మర్‌ను దృష్టిలో ఉంచుకునే వీరిద్దరూ ప్రాక్టీస్ చేసినట్టు అర్థమవుతోంది. గంభీర్ కూడా వీరిద్దరికీ సలహాలు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే  నెంబర్ 4లో జురెల్‌ను ఆడించే ఆప్షన్ కూడా ఉంది.

ఎం దుకంటే తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్ ను మూడో స్థానంలో ఆడించి ప్రయోగం చేసిన గంభీర్ ఓ మాదిరి ఫలితాన్ని సాధించా డు. అయితే మూడో స్థానంలో ప్రధాన బ్యా టర్‌నే ఆడించడం ఉత్తమమని పలువురు సూ చించారు. ఇక్కడ జురెల్ నాలుగులో ఆడితే ఎంతవరకూ సక్సెస్ అవుతాడన్నది చూడాలి. 

మరోవైపు గిల్‌కు రీప్లేస్‌మెంట్‌గా బీసీసీఐ తెలుగుతేజం, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం నితీశ్ సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికార వన్డే సిరీస్‌లో భారత్ ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదట నితీశ్ ఈ టెస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే కోల్‌కత్తా టెస్టులో స్పిన్నర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో అతనికి చోటు దక్కలేదు. దీంతో ఆ ఆల్‌రౌండర్‌ను భారత్ ఏ జట్టులోకి పంపించారు. ఇప్పుడు గిల్ గాయపడడం, రెండో టెస్టులో ఆడడంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ టెస్ట్ జట్టులో చేరమని బీసీసీఐ ఆదేశించింది.

ఒకవేళ గిల్ గుహావటి టెస్టుకు దూరమైన గిల్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా రెండో టెస్ట్ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. తొలి టెస్ట్ ఓడిపోవడంతో ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. అటు సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు సిరీస్ వారి సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ గుహావటిలో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.మొత్తం మీద సఫారీలను తక్కువ అంచనా వేసి తొలి టెస్టులో మూల్యం చెల్లించుకున్న భారత్ ఎలాగైనా సిరీస్ సమం చేయాలని పట్టుదలతో తుది జట్టుపై మరింత ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు.