28-07-2025 01:37:31 AM
బాచుపల్లి పీఎస్లో బాధితుడి ఫిర్యాదు
కుత్బుల్లాపూర్, జులై 27(విజయ క్రాంతి): భర్త హత్యకు భార్య ప్లాన్ భర్త తృటి లో తప్పిచుకున్న ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిజాంపేట్ పరిధిలో నివాసం ఉం టున్న ఓ మహిళ కిరాయి మనుషులతో భర్త ను కడతేర్చాలనుకుంది. వనపర్తి జిల్లా, పెద్దగూడెం తండాకు చెందిన నేనావత్ రాందాస్ అనే వ్యక్తితో అదే ప్రాంతం లోని మర్రికుంటకు చెందిన జ్యోతి అనే మహిళతో 2009 లో వివాహమైంది.
వివాహనంతరం దంపతులు బతుకుదెరువు కోసం నగరంలోని బాలానగర్ ప్రాంతానికి వచ్చి కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమం లో మూడేండ్ల క్రితం దంపతుల మద్యన విభేదాలు తలెత్తడంతో జ్యోతి తన భర్తపై వనపర్తి పీఎఎస్లో గృహహింస కేసు పె ట్టింది. అప్పటినుండి రాందాస్ తన సొంత ఊరు అయిన తండాలో ఉంటుండగా, జ్యోతి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఒంటరిగా ఉంటూ, తమ కూతుళ్లు ఇద్దరిని తన తల్లిగారి ఇల్లు మర్రిగూడ వద్ద ఉంచింది.
ఈ క్రమంలో నెలరో జుల క్రితం జ్యోతి పెద్దమనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో తాను భర్తతో కలిసి ఉంటానని ఒప్పుకుంది. అప్పటినుండి రాందాస్ తన భార్య జ్యోతితో కలిసి రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కూలీపనులకు వెళు తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయం త్రం పనికివెళ్లి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాందాస్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి మీ భార్య జ్యోతి జగన్ స్టూడీయో వద్ద రొట్టెలు విక్రయించే చోటుకు రమ్మంటుందని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. ఇంతలో ఓ యువకుడు బైక్పై జగన్ స్టూడియో వద్దకు వచ్చి రాందాస్ను మందుతాగుదాం రమ్మంటూ పిలిచాడు.
తాను అప్పటికే తాగి ఉన్నానని, నేనెక్కడకి రానని సమాధానం ఇవ్వగా జ్యోతి కలుగజేసుకుని వెళ్లమంటూ బలవంతపెట్టగా రాందాస్ ఆతని వెంటవెళ్లారు ఇద్దరు కలిసి సాయినగర్ కమాన్ వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని వైన్షాప్లో రెండు బీర్లు కొనుగోలు చేసి, అక్కడి నుండి ఇద్దరు కలిసి బౌరంపేట్ ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ వద్దకు వెళ్లారు. అక్కడ రాందాస్తో వెంట తెచుకున్న బీర్లు తాగించారు.
ఈ లోగా మరో ఇద్దరు రాగా తాగిన మైకంలో ఉన్న రాందాస్పై దాడిచేసి బీర్ సీసాలతో తలపై బలంగా మోదారు. దీంతో బాధితుడు సృహ తప్పి పడిపోవడంతో చనిపో యాడనుకుని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు రాందాస్ స్పృ హలోకి వచ్చి జరిగిన విషయాన్ని సమీపం లో నివాసం ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లి వివరించాడు. ఆదివారం బాచుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే బాధితుడు నివాసముంటున్న నిజాంపేట రాజీవ్ గృహ కల్ప సముదాయం బాచుపల్లి పీఎస్ పరిధిలోకి వస్తే, దుండిగల్ పీఎస్ పరిధిలోకి వస్తుందంటూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు కేసును దుండిగల్ పీఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా తనను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే జ్యోతి ఇతరులతో కలిసి పన్నాగం పన్నిందని రాందాస్ ఆరోపించారు.