11-08-2025 01:21:21 AM
స్టార్ హీరోయిన్ సమంత మునుపటిలా సినిమాలు చేయడం లేదు. కొత్త ప్రాజెకట్స్ ఎప్పుడు సైన్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్, మా ఇంటి బంగారం అనే సినిమా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సమంత గురించి ఓ ఆసక్తికర వార్త వినవస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా ’పెద్ది’. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో స్పోరట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ఓ ఐటం సాంగ్ చేయనుందన్న వార్త ఇప్పుడు సినీ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది.
ఇంతకుముందు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్తో జోడీకట్టి మెగా ఫ్యాన్స్ను అలరించింది సమంత. ’పుష్ప’లో అల్లు అర్జున్తో సామ్ చేసిన ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. దీంతో పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సా్ంప అంచనాలు మరోస్థాయిలో పెరిగిపోతోంది. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు దీని గురించి సమంతతో మాట్లాడారట. సమంత నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉందట.
డైరెక్టర్ బుచ్చిబాబు.. సుకుమార్ శిష్యుడు కావడం, ఇప్పటికే చరణ్తో సమంత పనిచేసి ఉండటం, పుష్ప, రంగస్థలం సినిమాల ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు ’పెద్ది’లో భాగమవడంతో ఈ సినిమాలో ప్రత్యేక గీతం చేసేందుకు సమంత ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. దీంతో రామ్ చరణ్-సమంత కాంబినేషన్లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ని డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా తెరకెక్కిస్తారోనని చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే.. మరోసారి సమంత ఐటెం సాంగ్ లో ఏ రేంజ్ లో హాట్ గా కనిపిస్తుందో అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ’పెద్ది’ షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. రామోజీ ఫిల్మ్సిటీలో వేసిన ఓ భారీ సెట్లో నైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్, జాన్వీకప్పూ లవ్ సీన్స్తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాల్ని షూటింగ్ ప్లాన్ చేశారు. కాన, సినీకార్మికుల సమ్మెతో షూటి్ంప ఎఫెక్ట్ పడింది. నవంబర్ లోగా సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.