8 May, 2026 | 10:15 PM

మళ్లీ ధరల పెరుగుదలా?

18-05-2024 12:05 AM

గత బీఆరెస్ ప్రభుత్వం భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి మూడేళ్లయినా అయిందో లేదో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పెంపుదలకు సమాయత్తమవుతున్నట్టు వార్తలు చదివి బెంబేలు పడుతున్నాం. సర్కారుకు ఆదాయ వనరుల కోసం ధరల పెరుగుదల తప్ప మరో మార్గాలేవీ కనిపించడం లేదా? ఎన్నికలై పోయాయి కాబట్టి, ఇప్పుడు యథేచ్చగా ధరలు పెంచుకోవచ్చునని ప్రభుత్వం అనుకోకూడదు. ఎప్పుడూ ఏవో ఎన్నికలు వస్తూంటాయి ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వుండాలంటే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం మంచిది.

- ఆకాంక్షరెడ్డి, సూర్యాపేట