15 June, 2026 | 7:01 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

25 నుంచి శీతాకాల సమావేశాలు

06-11-2024 01:33 AM

న్యూఢిల్లీ, నవంబర్ 5: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారం భం కానున్నాయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. మంగళ వారం ఎక్స్ వేదికగా సమావేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవబంర్ 26(రాజ్యాంగ దినోత్సవం)న రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తవనున్న సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.

వీటికి సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతనే శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సెషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వక్ఫ్ బిల్లుకు సవరణలు, జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి నిబంధనల బిల్లులపై ఈ సమావేశంలో చ ర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.