20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

విష పదార్థం సేవించి మహిళ మృతి

20-07-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, జులై 19 (విజయ క్రాంతి): విష పదార్థం సేవించి మహిళ మృతి చెం దిన ఘటన తాండూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన మునిగేపల్లి రాజయ్య చిన్న కూతురు రెండు సంవత్సరాల క్రితం అంతర్ కుల వివాహం చేసుకోవడంతో కుటుంబంలో భార్య భర్తల మధ్య తరచూ మనస్పర్దాలు ఏర్పడడంతో 12వ తేదీన రాజయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళగా భార్య మునిగేపల్లి జయ వ్వ (50) ఇంట్లో తెలియని విష పదార్థం సేవించడంతో గమనించిన కుటుంబ స భ్యులు ఆమెను ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి త రలించారు. అక్కడినుండి సూరారంలోని ఆసుపత్రికి తరలించారాని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.

అక్కడ చికిత్స పొందినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో శనివారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.అదే రోజు రాత్రి జయవ్వ మృతి చెందినట్లు భర్త రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.