28-04-2025 01:54:27 AM
రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు
కరీంనగర్ అర్బన్, ఏప్రిల్ 27 : నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇవ్వాలని రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అధ్యక్షతన జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సునీతరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత సాధన కోసం శక్తివంచన లేకుండా పోరాడాలని, రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ర్టపతి లాంటి ఉన్నతమైన స్థానాల్లో మహిళలకు స్థానం కల్పించి ఘన చరిత్ర సృష్టించిందన్నారు.. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కష్టపడ్డ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి జిల్లాస్థాయిలో వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మండలాల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.