18-11-2025 10:40:26 PM
విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి
డయల్ -100 కాల్స్ కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలి
సైబర్ క్రైమ్ పై ప్రజల్లో అవగాహన పెంచాలి
నేరప్రవర్తన గల వ్యక్తులపై పరిశీలన తప్పనిసరి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, రిసిప్షనిస్ట్, స్టేషన్ రైటర్, టేక్ టీం, ఎస్ హెచ్ ఓ, మెన్ రెస్ట్ రూమ్, లాక్ ఆఫ్ రూమ్, లను స్టేషన్ పరిసరాలను, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీలు, సస్పెక్ట్ ల ఫోటోలను చూపిస్తూ అందరూ వీళ్ళను గుర్తుపట్టగలరా అని పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని పరిసరాలలో ఆహ్లాదకరమైన వాతావరణముండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ అండ్ కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని నేను పల్లి ఎస్ఐకి ఎస్పీ సూచించారు.
పోలీస్ సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ పరిష్కరించుకోవాలన్న అన్నారు. బ్లూ కోర్ట్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ తనికెళించే పట్టి రోడ్డు ప్రమాదం తగ్గించాలని సూచించారు. సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. తరచు గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై మూఢనమ్మకాలు బాల్యవివాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సిఐ రామన్, దేవునిపల్లి ఎస్ హెచ్ ఓ రంజిత్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్ ను స్టేషన్ పరిసరాలను పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పి గారు PS పరిధిలోని రౌడీ, సస్పెక్ట్ ల ఫోటోలను చూపిస్తూ అందరు వీళ్ళను గుర్తు పట్టగలరా లేదా అని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ - 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని మరియు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర దేవునిపల్లి ఎస్సైకి సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాపర్ గా బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి అన్నారు, సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై, మూడ నమ్మకాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ బి చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్హెచ్ఓ రంజిత్ సిబ్బంది పాల్గొన్నారు.