విద్యార్థులతో పనులా?
16-11-2025 12:00 AM
ఇల్లంతకుంట, నవంబర్ 16(విజయక్రాంతి); రాజన్న సిరిసిల్ల జిలా ఇల్లంతకుంట మండలం జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు డైనింగ్ హాల్ శుభ్రం చేయించారు. విద్యార్థులతో పనులు చేయిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.




