21-06-2025 05:08:54 PM
కరీంనగర్ (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకలను శనివారం సిద్ధార్థ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు చేసారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతి నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వష్ట శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.