22-06-2025 01:03:29 AM
విశాఖపట్నం, జూన్ 21: ప్రపంచమ ంతా ప్రస్తుతం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోందని.. ఇలాంటి సమయం లో యోగానే ప్రపంచానికి శాంతి మార్గం చూపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి యోగా ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు.
అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని శనివారం ఏపీలోని విశాఖ పట్నం వేదికగా జరిగిన ‘యోగాంధ్ర- 2025’ కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం రోడ్డు వరకు 32 కిలోమీటర్ల మేర చేపట్టిన యోగాంధ్ర-2025 లో భాగంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ’ అనే థీమ్తో దాదాపు 3 లక్షల మందితో కలిసి మోదీ యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారిందని, ఇది ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. యోగా కు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవన్నారు. ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగా కేవలం వ్యా యామం కాదని.. అదొక జీవన విధామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నా యుడు, ప్రతాపరావు జాదవ్, చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఏపీ ముఖ్య మంత్రి చంద్రాబాబు పేర్కొన్నారు.
యోగాంధ్ర-2025 పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో చర్రిత సృష్టించామన్నారు. యోగాసనాల్లో 3 లక్షల మందికి పైగా పాల్గొనడం గొప్ప విషయమని, యో గాంధ్రలో భాగంగా 1.70 కోట్ల మందికి ధ్రువపత్రాలు జారీ చేశామన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యావత్ భారతావని వేడుకగా నిర్వహించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దేశ ప్రజలంతా యోగాసనాల వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేయగా.. జ మ్మూకశ్మీర్లోని ఉదంపూర్లో రాజ్నాథ్ సింగ్ ప్రజలతో కలిసి యోగా దినో త్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
జమ్మూలోని లడాఖ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఎల్వోసీ వెంబడి పహారా కాస్తున్న సాయుధ బలగాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శీర్షాసనాలు వేశారు. బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, శ్రీలంక, ఇం డోనేషి యా, సిగపూర్, దక్షిణ కొరియా వంటి 15 దేశాల నుంచి వచ్చిన 17 మంది యోగా గురువుల ఆధ్వర్యంలో భారత్లో ‘యోగా బంధన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తం గా 191 దేశాల్లోని 1300 నగరాల్లో శనివారం యోగా పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘యోగాంధ్ర-2025’
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా నిర్వహించిన యోగాంధ్ర- 2025 రికార్డు సృష్టించింది. విశాఖ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు యోగాసనాల్లో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం రోడ్డు మార్గం వరకు ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు.