యువరైతు ఆందోళన
24-05-2026 07:16 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద యువ రైతు ఆదివారం ఆందోళన చేశాడు,కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి ఐకెపి సెంటర్ కి లారీలను అలాట్మెంట్ చేయడం లేదని సంతోష్ అనే రైతు చేతిలో ఒక డబ్బా పట్టుకొని లారీ ఎక్కాడు, ఐకేపీ సెంటర్ కి లారీని పంపించాలని సంతోష్ డిమాండ్ చేశాడు, సుల్తానాబాద్ అదనపు ఎస్ఐ అశోక్ రెడ్డి రైతుకు నచ్చచెప్పి లారీ పై నుండి కిందకు దించాడు, ఆ లారీ నీ ధాన్యం లోడ్ చేయడం కోసం సంతోష్ కి అప్పజెప్పడం జరిగింది అని ఎస్సై అశోక్ రెడ్డి తెలిపారు , దీంతో గొడవ సద్దుమణిగింది.






