17-11-2025 03:36:35 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల నర్సాపూర్ గ్రామానికి చెందిన పల్లె సంజయ్ (19) అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో నిన్నటి రోజున అనగా ఆదివారం సాయంత్రం వేళలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రహించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న యువకుడు సంజయ్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మృతి చెందారు.