17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడి బలి

26-03-2025 12:00 AM
  • రూ.2 లక్షల అప్పు చేసి బెట్టింగ్

పోగొట్టుకుని రైలు కింద పడి ఆత్మహత్య 

మేడ్చల్, మార్చి 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. రూ.రెండు లక్షలు అప్పు చేసి, బెట్టింగులో నష్టపోవడంతో మనోవేదనకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసు యుష్నూడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన సోమేష్(29) కొంపల్లిలో గోదాం ఇన్‌చార్జిగా పనిచేస్తూ గుండ్ల పోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడిన సోమేష్ రూ.2లక్షల అప్పు చేశాడు.

అవి బెట్టింగ్‌లో పోవడంతో మనో  గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితులకు లోకేషన్ షేర్ చేశాడు. గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లొకేషన్ ఆధారంగా అక్కడకు వెళ్లిన స్నేహితులు మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.