17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

'మీ డబ్బు మీ హక్కు' కార్యక్రమం నేడు శిబిరం

19-12-2025 06:13 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయ క్రాంతి): ఈనెల 20 వ తేదీన (శనివారం) కలెక్టరేట్లో 'మీ డబ్బు మీ హక్కు' అనే అంశంపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోని డబ్బుకు సంబంధించి అవకాశం కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బ్యాంకులలో పొదుపు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్స్, బీమాలు క్లెయిమ్ చేసుకునేందుకు ఈ శిబిరం అవకాశం కల్పిస్తుందని అన్నారు. ద్వారా  10 సంవత్సరాలకు పైబడి బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకుని నిల్వ వివరాలు ఆర్బిఐ ఉద్గం వెబ్ సైట్ లో పొందవచ్చునని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులకు బ్యాంకుల్లోనే డబ్బులు పొందేందుకు ఈ శిబిరం ఆకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.