17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఏబీవీపీ సామూహిక వందేమాతరం

19-12-2025 06:15 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘట్ కేసర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వందేమాతరం కార్యక్రమం విద్యార్థులతో కలిసి గురుకుల్ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి దాదాపు 1300 విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పూర్తి వందేమాతరం గీతం ఆలాపన చేశారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణమూర్తి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వందేమాతరం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యాసమితి సభ్యులు అంకం శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి దేశ భక్తి అలవార్చుకొని వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గురుకుల్ జూనియర్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ నారాయణ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను, సచిన్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ఉదయ్, గౌతమ్, హరి, రామకృష్ణ, ప్రవీణ్, బలరాం, అనిల్, మనోజ్, అనురాగ్, సాయిహర్ష కార్యకర్తలు పాల్గొన్నారు.