calender_icon.png 2 January, 2026 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

02-01-2026 12:00:00 AM

సిజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలు

ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్రెడ్డి

గుమ్మడిదల, జనవరి 1 :స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సా గాలని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి గురువా రం పిలుపునిచ్చారు. జనవరి 12న జరగనున్నస్వామి వివేకానంద జయంతి సందర్భం గా సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుమ్మడి దల మున్సిపాలిటీ కేంద్రంలోని సిజిఆర్ క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ సభ్యులతో చిమ్ముల గోవర్ధన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి యజేశారు.

యువతలో క్రీడాస్ఫూర్తిని పెం పొందించేందుకు, వివేకానంద ఆశయాలను ప్రతిష్ఠించేందుకు జనవరి 10, 11, 12 తేదీలలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. అ నంతరం ఆయన ఆ పాఠశాల క్రీడామైదానా న్ని స్వయంగా పరిశీలించారు. క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పా ల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని గోవర్ధన్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కా ర్యదర్శి ఏ.కృష్ణ, పీఈటీ, కబడ్డీ కోచ్ అమ్మగారి విష్ణువర్ధన్రెడ్డి, దేవేందర్రెడ్డి, యాదిరెడ్డి, సత్యనారాయణ, సూర్యనారాయణ, పొన్నా ల శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, పి శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్కుమార్, కరుణాకర్గౌడ్, చంద్రారెడ్డి, జయపాల్రెడ్డి, నర్సింలు, సత్యం ముదిరాజ్, సాయిగౌడ్,తదితరులు పాల్గొన్నారు.