calender_icon.png 20 June, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి: డీఎస్పీ సూర్యనారాయణ

19-06-2025 08:22:21 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలని, యువత తమ లక్ష్యసాధనలో ముందుండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ(DSP Suryanarayana) గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ... కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్, కాళేశ్వరం, మహ మూత్తారం, పలిమెల, మలహర్రావు, మండల కేంద్రాలతో పాటు గ్రామాలలో కూడా యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని ఈ గంజాయి త్రాగిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత వారం రోజుల క్రితం గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాకాలం ప్రారంభం అయినది గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోందని గోదావరి లోతుగా ఉందని ముఖ్యంగా యువత గోదావరిలో స్నానానికి వెళ్లి సెల్ఫీలు వీడియోలు తీయరాదని గోదావరిలో ఈత కొట్టరాదని ప్రతి గ్రామపంచాయతీ నుండి పంచాయతీ కార్యదర్శులు గ్రామ పెద్దలు అందరికీ తెలియజేయాలని కోరారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో స్నానాలకు వెళ్లి ఈత కొట్టడం, సెల్ఫీలు, వీడియోలు, నిషిద్ధమని తెలిపారు.

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం, జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో పశువులు ఉంటున్నాయని ఈ పశువుల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ పశువుల యజమానులు తమ పశువులను తమ ఇంటి వద్దకు తీసుకువెళ్లాలని లేనిచో గ్రామపంచాయతీ, పోలీసుల ఆధ్వర్యంలో గోశాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పనుల నిమిత్తం, ఇతర పనుల కొరకు మైనర్లకు ట్రాక్టర్లు, బైకులు మరియు ఇతర మోటార్ వాహనాలను ఇవ్వరాదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై వాహన యజమానుల మీద కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. కాటారం సబ్ డివిజన్లోని ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రామచంద్ర రావు, ఎస్సై నాందేవ్, ప్రొబేషనరీ ఎస్సై సాయి శశాంక్ తదితరులు పాల్గొన్నారు.