19-06-2025 08:25:24 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రాబోయే ఎన్నికలలో దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా పనిచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తామని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సిందం శశికాంత్(District Vice President Sindam Shashikant) అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన కుటుంబం, ఇందిరమ్మ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దేశ ప్రజల కష్టాలను తీర్చగలిగే ఒకే ఒక్క నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంగరి దయాకర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ జానీ గౌడ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి తుడుం ఇంద్రకరణ్, నాయకులు లక్ష్మారెడ్డి, గుండారం నర్సింలు, కృష్ణ యాదవ్, మన్నె నరేష్, పాపని ఆంజనేయులు, మల్లేశం, నిరుడి నరేష్, వినోద్ కుమార్, యాదగిరి ,బొడ్డురాజు, ప్రభాకర్, నవీన్, వినయ్, ఎల్లం, బాలయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.