ఘోర రోడ్డు ప్రమాదంపై జగన్ సంతాపం
తాడేపల్లి: అన్నమయ్య జిల్లా(Annamayya District) కురబలకోట మండలం దొమ్మన బావి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ, టెంపో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులను కర్ణాటకలోని బాగేపల్లి వాసులుగా గుర్తించారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనను తీవ్ర దురదృష్టకరమని అభివర్ణించిన జగన్, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేశారు.






