calender_icon.png 30 June, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు విషాదకరం

30-06-2025 02:27:01 PM

హైదరాబాద్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు విషాదకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తోన్న వార్తలు కలచి వేశాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని కవిత కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కవిత ఎక్స్ లో పోస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు ప్రమాదం సంభవించింది.

పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌  పరిశ్రమలో రియాక్టర్‌(Telangana Chemical Factory Blast) పేలింది.  ఈ ప్రమాదంలో ఎనిమింది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. పాశమైలారం రియాక్టర్‌  పేలిన ప్రమాద స్థలంలో ఇంకొక బ్లాక్‌ ఓపెన్‌ చేయాల్సి ఉందని మల్టీజోన్‌ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నామన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదసమయంలో కంపెనీలో 150మంది ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 90 మంది ఉన్నారని మల్టీజోన్‌ ఐజీ స్పష్టం చేశారు.