calender_icon.png 24 June, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.211.90 కోట్ల రైతు భరోసా

24-06-2025 01:07:49 AM

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి

కరీంనగర్, జూన్ 23 (విజయ క్రాంతి): జిల్లాలోని మొత్తం 2,10,904 మంది రైతులకు గాను తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 6000 రూపాయల చొప్పున 211 కోట్ల 90 లక్షల 69,841 రూపాయలు రైతు భరోసా పథకం క్రింద ఈ వానాకాలం పంట అవసరాల నిమిత్తం కేటాయించినట్లు జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న  రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించారని తెలిపారు.

ఈనెల 16 న 1,24,727 మంది రైతులకు 65 కోట్ల 79 లక్షల 92,748 రూపాయలు, 17న 27,307 మంది రైతులకు 40 కోట్ల 25 లక్ష ల 18,477 రూపాయలు,19న 15,995 మం ది రైతులకు 32 కోట్ల 91 లక్షల 15,728 రూ పాయలు, 20 న 9,955 మంది రైతులకు 26 కోట్ల 39 లక్షల 48,444 రూపాయలు, 21న 5,684 మంది రైతులకు 19 కోట్ల 36 లక్షల 58,799 రూపాయలు, 23 న 3,284 మంది రైతులకు 17 కోట్ల 11 లక్షల 40, 90 8 రూపాయలు జమ అయ్యాయని తెలిపారు.

మొత్తం 1,86,952 మంది రైతుల ఖా తాల్లో 201 కోట్ల 83 లక్షల 75,105 రూపాయలు జమయ్యాయని తెలిపారు. 24న సాయంత్రం 6 గంటలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా, సన్న బియ్యం బోనస్ లబ్దిదారులను ఉద్దేశించి రైతు నేస్తం కార్యక్రమం లో ప్రసంగిస్తారని తెలిపారు. లబ్ధిదారులు అందరు అధిక సంఖ్య లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంచేయాలనికోరారు.