24-06-2025 01:07:49 AM
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి
కరీంనగర్, జూన్ 23 (విజయ క్రాంతి): జిల్లాలోని మొత్తం 2,10,904 మంది రైతులకు గాను తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 6000 రూపాయల చొప్పున 211 కోట్ల 90 లక్షల 69,841 రూపాయలు రైతు భరోసా పథకం క్రింద ఈ వానాకాలం పంట అవసరాల నిమిత్తం కేటాయించినట్లు జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించారని తెలిపారు.
ఈనెల 16 న 1,24,727 మంది రైతులకు 65 కోట్ల 79 లక్షల 92,748 రూపాయలు, 17న 27,307 మంది రైతులకు 40 కోట్ల 25 లక్ష ల 18,477 రూపాయలు,19న 15,995 మం ది రైతులకు 32 కోట్ల 91 లక్షల 15,728 రూ పాయలు, 20 న 9,955 మంది రైతులకు 26 కోట్ల 39 లక్షల 48,444 రూపాయలు, 21న 5,684 మంది రైతులకు 19 కోట్ల 36 లక్షల 58,799 రూపాయలు, 23 న 3,284 మంది రైతులకు 17 కోట్ల 11 లక్షల 40, 90 8 రూపాయలు జమ అయ్యాయని తెలిపారు.
మొత్తం 1,86,952 మంది రైతుల ఖా తాల్లో 201 కోట్ల 83 లక్షల 75,105 రూపాయలు జమయ్యాయని తెలిపారు. 24న సాయంత్రం 6 గంటలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా, సన్న బియ్యం బోనస్ లబ్దిదారులను ఉద్దేశించి రైతు నేస్తం కార్యక్రమం లో ప్రసంగిస్తారని తెలిపారు. లబ్ధిదారులు అందరు అధిక సంఖ్య లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంచేయాలనికోరారు.