23-04-2025 12:56:05 AM
పెద్దపల్లి, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీ డియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ 3827 మంది విద్యార్థులకు గాను 2390 విద్యార్థులు 62.45% శాతంతో ఉత్తీర్ణులు అయ్యారు. సెకండ్ ఇయర్ లో మొత్తం విద్యార్థులు 3797 విద్యార్థులకు గాను 2659 విద్యార్థులు 70.03 ఉత్తీర్ణతా శాతంతో పాస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఇయర్ లో 11వ స్థానాన్ని, ఫస్ట్ ఇయర్లో 12 వ స్థానాన్ని పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే మంచి ఉత్తీర్ణత శాతంతో మన జిల్లా చాలా మెరుగైన ఫలితాలు సాధించారు.
ఇందులో ప్రభుత్వ కళాశాల ఫస్ట్ ఇయర్ లో మంథని బాలికల కళాశాల లో 470 మార్కులకు 465 మార్కులతో ఎంపీసీ గ్రూప్ లో శ్రీజ ప్రథమ స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ విద్యార్థి నవీన్ కుమార్ 980 మార్కులతో ఎంపీసీ గ్రూప్ లో మొదటి స్థానాన్ని సంపాదించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల గోదావరిఖని కళాశాలలో కే స్ఫూర్తి 978 మార్కులతో హెచ్ ఈసీలో ప్రథమ స్థానం పొందారు.