calender_icon.png 21 June, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత

23-04-2025 12:57:13 AM

జగిత్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణతా శాతం పెరిగిందని జిల్లా ఇంటర్ అధికారి బి.నారాయణ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ  కృష్ణ ఆదిత్య మంగళవారం విడుదల చేశారు. ఈ ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా వివరాలను ఆయన వెల్లడించారు.

జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ జనరల్ కోర్సుల్లో 56.34 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్ కోర్సులలో 46.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే సెకండియర్ జనరల్ కోర్సులలో 68.73 శాతం మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులలో 65.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు.

కాగా ఫస్టియర్లో గత విద్యా సంవత్సరం కంటే 4.65 శాతం ఉత్తీర్ణత పెరిగ్గా, సెకండియర్లో 4.4 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం మే 22 నుండి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సూచించారు.

ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు భావిస్తే రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం రేపటి నుండి ఈ నెల 30 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి ఫలితాలను నిర్ధారించుకో వచ్చాన్నారు. స్కాన్డ్ జవాబు ప్రతిని కూడా పొందవచ్చని జిల్లా అధికారి నారాయణ వివరించారు.