calender_icon.png 24 June, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి డైరెక్టర్(పా)ను కలిసిన వైరా ఎమ్మెల్యే..

23-06-2025 10:27:16 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్(పా) గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ పోట్రూను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్(MLA Maloth Ramdas Nayak) మర్యాదపూర్వకంగా కలిశారు. డైరెక్టర్(పా)ను శాలువతో సన్మానించి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ భద్రాచలం ఐపిడిఏ పిఓగా జిల్లా గిరిజన ప్రజల మన్ననలు పొందారని, అదేవిధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్(పా) గా పదవి బాధ్యతలు చేపట్టి, సింగరేణి కార్మిక వర్గానికి కూడ మరింత సేవలు చేసి, కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని సింగరేణి కార్మికుల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు.

అదేవిధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైరా నియోజకవర్గానికి సింగరేణి నిధులతో, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి డైరెక్టర్ పా, సహకారం అందించాలని కోరినారు. డైరెక్టర్ పా ను కలిసిన వారిలో మాజీ జడ్పిటిసి కంచర్ల చంద్రశేఖర్ రావు, సింగరేణి కంపెనీ అడ్వకేట్ వెల్లంకి వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుగులోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.