20-06-2025 01:10:33 AM
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): టెట్లో భాగంగా రెండో రో జు గురువారం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఉదయం సెషన్లో 74.96 శాతం, మధ్యాహ్నం సెషన్లో 74.64 శాతం మంది హాజరయ్యారు.
తొలిసెషన్లో 13,043 మందికిగాను 9,777 మంది హాజరుకాగా, రెండో సెషన్లో 13,187 మందికిగాను 9,843 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ నెల 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.