calender_icon.png 20 June, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

110 మొబైల్ ఫోన్ల రికవరీ

20-06-2025 01:10:27 AM

బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి మొబైల్స్ పొందవచ్చు

కామారెడ్డి, జూన్ 19 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో చోరీకి గురైన 110 మొబైల్ ఫోన్ లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు పోలీసులకు లభించిన ఫోన్లో ఉన్నవారు కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. సుమారు రూ. 16 లక్షల విలువచేసే మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు ఎస్పి వెల్లడించారు. మొబైల్స్ రికవరీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని 3263 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు.

సెల్ ఫోన్ పట్ల అశ్వద్ధ చేస్తే ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సిమ్ కార్డు బ్లాక్ చేసి అదే నెంబర్ గల కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ఐఎంఈఐ వివరాలు బ్లాక్ చేయడం వల్ల పోగొట్టుకున్న మొబైల్ విభంగా దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఒక ఆర్ ఎస్ ఐ పదిమంది పోలీస్ కానిస్టేబుల్ తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు ఆర్‌ఎస్‌ఐ బాలరాజు నువ్వు సంప్రదించాలని కోరారు. ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in లొ రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం  జిల్లా ఎస్పీ శ్రీ  యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు వెల్లడి.    సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి  గురైన 110  మొబైల్ ఫోన్లను  ( సుమారు  16 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని తెలియజేశారు. 

ఈ మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఇప్పటివరకు 3263 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలి  మరియు SIM కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త SIM తీసుకోవాలి.

తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వ్బుసైట్ లో బ్లాక్ చేయడం వలన  పోగొట్టుకున్న మొబైల్  సులబంగా దొరికే అవకాశం ఉన్నది.    జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (10) రోజులలో ఈ టీం అధికారులు 110 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు. 

ఈ సందర్భంగా 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.   ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుంది. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి RSI బాలరాజ్ ను సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించగలరని తెలిపారు.