11-01-2026 12:19:57 AM
ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, జనవరి 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్ను మంత్రి సీతక్క శినవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాల ప్రజలు వస్తు వెళుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా ఇక్కడ అడవి అందాలు ఉంటాయని చెప్పారు.